హైదరాబాద్: సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని తెలియజేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. పదేళ్లలో ఆర్డిఎస్ తుమ్మిళ్ల, పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలని సూచించారు.
బిఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి, ఎమ్మల్యే హరీశ్ రావు, సంతోష్ సోషల్ మీడియా తన పైనే దాడి చేస్తున్నాయని, సోషల్ మీడియాలో తనపై దాడిని ప్రజలు గమనిస్తున్నారని కవిత పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని..ఆమోదించాలని ఛైర్మన్ ను కోరానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. రేపు చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని కవిత స్పష్టం చేశారు.
Also Read : కండువా కప్పితే పార్టీ మారినట్లేనా