హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఎమ్ఎల్ఎ గా గెలిపించారని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్ఎల్ఎగా గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించానని, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ను కోరానని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Also Read : మా తెలంగాణ ట్రంప్ ను కూడా పక్కన పడేశారు : రేవంత్