శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కువైట్ నుండి వచ్చిన ఒ ప్రయాణికుడు ఐరన్బాక్స్లలో బంగారం తరలిస్తూ అగష్టు 22వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రెండు ఐరన్ బాక్సు లను వదిలి వెళ్ళాడు. ఐరన్ బాక్సులను ఓపెన్ చేసి చూడడంతో అందులో 1261.800 గ్రాముల బంగారు ఆభరణాలు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారు ఆభరణాలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 1.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, సదరు ఐరన్ బాక్సులు వదిలి వెళ్ళిన నిందితుడి కోసం సిసి కేమారాలలో నిఘా ఏర్పాటు చేశారు. కానీ బాక్సులు తీసు కెళ్ళేందుకు రాకపోవడంతో ఐరన్ బాక్సులను స్వాధీనం చేసుకున్న డిఐఆర్ ఆధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
ALso Read: ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం