ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి… పాక్‌కి బుద్ధి వచ్చేలా..

Pakistan

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, ఆసియా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే పాకిస్థాన్‌కు ఐసిసి, ఎసిసి బద్ధి వచ్చేలా సమాధానం ఇఛ్చింది.

పాకిస్థాన్ (Pakistan) ఫిర్యాదును ఐసిసి పెద్దగా పట్టించుకోలేదు. మ్యాచ్‌ రిపరీపై చర్యలకు అంగీకరించలేదు. పిసిబి డిమాండ్‌ను తిరస్కరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా మాత్రం ఆసియాకప్ నుంచి వైదొలుగుతామని ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ముందుకుగా నిర్ణయించిన విధంగానే బుధవారం పాకిస్థాన్, యుఎఇతో మ్యాచ్‌లో తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాకిస్థాన్ సూపర్ 4కు చేరుకుంటుంది. ఇది జరిగితే సెప్టెంబర్ 21వ తేదీన ఆ జట్టు టీం ఇండియాతో తలపడనుంది.

Also Read : దాయాదుల పోరులో కనిపించని జోష్.. చప్పగా సాగిన భారత్-పాక్ మ్యాచ్