లద్దాఖ్ లో పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి, రాజ్యాంగ పరిరక్షణల కోసం జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత ఐదేళ్లుగా నిరుద్యోగం, స్థానిక పాలన లేకపోవడం వంటి సమస్యలు యువతలో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్, ఇది ‘జనరేషన్-జెడ్’ విప్లవమని అభివర్ణించారు.