మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోం ది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. ఇక ఎంత మా త్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంతో ఆ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. రిజర్వేషన్లను తేల్చాల్సిన బాధ్యతను పం చాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో ఆ శాఖ దాదాపుగా ఖరారు చేసి ప్రభుత్వానికి మంగళవారం అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభు త్వం పరిశీలన తర్వాత ప్రత్యేక జివోను జారీ చేస్తుంది. ఇందుకు అవసరమైన క్షేత్రస్థాయి ఏ ర్పాట్లు జరిగిపోయాయి.
ఇక రిజర్వేషన్లు కూడా తేలిపోవడంతో జిల్లాల్లో యంత్రాంతం సిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ లు, 565 ఎంపీపీలు, 565 జడ్పీటీసీలు, 31 జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ సోమవారం రాత్రి వరకు ముమ్మరంగా సాగింది. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీవోలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ రిజర్వేషన్లకు 2024 కుల సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేసినట్లు సమాచారం.
42 శాతం బిసిలకు రిజర్వేషన్ అమలైతే ఇలా ఉండొచ్చు
విశ్వసనీయ సమాచారం మేరకు 42 శాతం బిసి రిజర్వేషన్ల విధానం అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా జీవో వచ్చిన తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టి కులాలకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 గ్రామ పంచాయతీలు, 90 జడ్పీటీసీలు, 95 ఎంపీపీలు, 1,011 ఎంపీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ని నిలబెట్టుకునేందుకు వీలుగా బిసిల రిజర్వేషన్లను పెంచేలా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో
ఆమోదించిన బిల్లుపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మరోవైపు హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30 సమీపిస్తుండటంతో ప్రభుత్వం జివో జారీ చేసి రిజర్వేషన్లను అమలు చేసేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరిస్తోంది. దీంతో ఈ ప్రక్రియను కొనసాగించేందుకు గడువు పొడిగించాలని హైకోర్టును కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ జీవో తదితర అంశాలపై రానున్న రెండు మూడు రోజుల్లోనే జరిగే సీఎం, మంత్రుల సమావేశంలో అధికారికంగా ప్రకటన వస్తుందని సమాచారం. కాగా మరో వైపు ప్రభుత్వం నుంచి ప్రత్యేక జివో విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్దంగా ఉంది.
Also Read: స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత