రాజమహేంద్రవరం(రాజమండ్రి) – తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ (ATR 72) విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.