మన తెలంగాణ/మంథని/రామగిరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృ ష్టించిన అడ్వకేట్ వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్రావు దంపతుల హత్యకేసు కు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచా రాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదు లు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో నిందితు లు బెయిల్పై ఉన్నారు. వామన్రావు దంపతుల హత్య కేసులో మా జీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్రావు ఆరోపణల నేపథ్యం లో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్రావు తండ్రి కిషన్రావు, త మ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సీబీఐ అధికారులు సేకరిం చారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సైతం పరిశీలించారు.
Also Read: శబరిమలలో బంగారం మాయం