బతుకమ్మ, దసరా పండగ సమీపిస్తున్న వేళ తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.