దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ‘నో హ్యాండ్షేక్’ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఇతర ఆటగాళ్లు.. పాక్ (Pakistan) ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా ఉండటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్ను తొలగించాలని పిసిబి డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నేడు (బుధవారం) పాకిస్థాన్ (Pakistan), యుఎఇల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవాలని పాక్ తీర్మానించుకుంది. అందుకోసం ఆటగాళ్లను హోటల్ నుంచి మైదానంకి రావద్దని పాక్ బోర్డు పేర్కొంది. అయితే ఈ మ్యాచ్ ఆడకపోతే.. పాకిస్థాన్ ఈ టోర్నమెంట్లో కొనసాగే అవకాశాన్ని కోల్పోతుంది. దీంతో మ్యాచ్ నిర్వహకులను మ్యాచ్ని ఓ గంట ఆలస్యంగా ప్రారంభించమని పిసిబి విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్ క్రికెటర్లు కూడా హోటల్ రూం నుంచి స్టేడియంకు బయలుదేరారు. మొత్తానికి పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడుతుందా.. లేదా అనే విషయం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : హెచ్సిఎ అక్రమాలపై విచారణ కమిటీ వేయండి