ఎస్ఐ కండకావరం… మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై దాడి

Pasra Police Station Mulugu District

ములుగు: కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై ఎస్ఐ దాడి చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. కుటుంబ సభ్యులతో మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ వారి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిపై ఎస్ఐ పుట్ట సతీష్ దాడి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా ఎస్ కనికరించకుడా వ్యక్తి చెంపపై కొట్టాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎస్ఐ ఆపడానికి ప్రయత్నించారు. వారిని కూడా పక్కకు నెట్టేశాడు. సామాన్యులపై పోలీసుల ప్రతాపం కాదు క్రిమినల్స్ పై చూపించాలని నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?