తిరుమల : ఈనెల 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీన తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.